News March 19, 2024
సీఎంవోకి చేరిన చిలకలూరిపేట పంచాయితీ

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. స్థానిక వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడిని CM జగన్ పిలిపించి మాట్లాడారు. ఇటీవల ఇన్ఛార్జ్గా రాజేశ్ని తప్పించిన అధిష్ఠానం గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ కోసం మంత్రి రజినీ రూ.6.5కోట్లు తీసుకున్నారని రాజేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బయటి వారికి టికెట్ ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు.
Similar News
News October 13, 2025
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖలో పెట్టుబడుల సదస్సుకు రావాలని ఆయన్ను ఆహ్వానించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు.
News October 13, 2025
వర్జ్యం అంటే ఏంటి?

వర్జ్యం అనేది విడువదగిన, అశుభ సమయం. దీన్ని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు. ప్రతి నక్షత్రంలో సుమారు 96 నిమిషాల వర్జ్యం ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు మొదలుపెట్టకూడదు. జాతకంలో గ్రహాలు వర్జ్య కాలంలో ఉంటే ఆ దశలలో ఇబ్బందులు కలుగుతాయి. వర్జ్యంలో దైవారాధన చేయవచ్చు. దానం చేస్తే దోషాలు పోతాయని శాస్త్రం చెబుతోంది.
☞ రోజువారీ వర్జ్యాలు, ముహుర్తాల ఘడియల కోసం <<-se_10009>>పంచాంగం<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 13, 2025
ఫిట్నెస్కి సారా టిప్స్ ఇవే..

ప్రస్తుతకాలంలో వివిధ కారణాల వల్ల బరువు పెరిగేవారి సంఖ్య పెరిగింది. సారాఆలీఖాన్ కూడా మొదట్లో ఆ బాధితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే ఈమె ప్రస్తుతం ఎంతో ఫిట్గా మారారు. దీనికోసం ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకున్నానని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెగ్యులర్ యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా తన ఆరోగ్యానికి కారణమంటున్నారామె.