News February 6, 2025
47లక్షల రైతుల పరిస్థితి ఏంటి?: హరీశ్రావు
తెలంగాణలో 68 లక్షల మంది రైతులుంటే ప్రభుత్వం 21.45 లక్షల మందికి రైతుభరోసా వేసిందని… మిగతా 47 లక్షల అన్నదాతల పరిస్థితి ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుభరోసా మెుత్తం తొలుత రూ.7500 అని చెప్పి దానిని రూ.6వేలకే కుదించారన్నారు. ఎకరం లోపు భూమి ఉన్నవారి సంఖ్య గతంతో పోలిస్తే తగ్గిందన్నారు. కాంగ్రెస్ గోరంత చేసి కొండంతగా చెప్పుకుంటుందని తన X ఖాతాలో పోస్ట్ చేశారు.
Similar News
News February 6, 2025
87 మద్యం షాపులకు ఒక్క దరఖాస్తూ లేదు
AP: కల్లు గీత కులాలకు ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల పాలసీకి స్పందన కరువైంది. 339 షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తే నిన్నటికి 730 దరఖాస్తులే వచ్చాయి. అందులో 87 షాపులకు ఒక్కరు కూడా అప్లై చేయలేదు. దీంతో ఎక్సైజ్ వర్గాలు షాకయ్యాయి. ప్రభుత్వం 10% మార్జిన్ మాత్రమే ఇస్తుండటం, ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. కాగా దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు పొడిగించారు.
News February 6, 2025
డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి
AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
పవన్కు స్పాండిలైటిస్.. ఇది ఎలా వస్తుంది?
<<15370291>>ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్<<>> స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు. జీవనవిధానంలో మార్పులు, మెడ దగ్గర దెబ్బ తగలడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్ వస్తుంది. దీనివల్ల మెడ, వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది. వాంతులు రావడం, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మెడ, భుజాలు, చేతులకు తిమ్మిర్లు, నిద్రలేమి సమస్య ఏర్పడతాయి. వ్యాధి ముదిరితే కండరాలు కృశించి పోయే అవకాశం ఉంది.