News March 19, 2024
విమానం బాత్రూమ్లో ఆత్మహత్యాయత్నం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
తైవాన్కు చెందిన ఇవా ఎయిర్లైన్స్ విమానం గాలిలో ఉండగా బాత్రూమ్లో ప్రయాణికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తోన్న విమానంలో ఓ వ్యక్తి బాత్రూమ్కు వెళ్లి ఎంతసేపటికీ రాలేదు. సిబ్బంది అనుమానంతో ఓపెన్ చేసి చూడగా అతను కొనప్రాణాలతో ఉన్నాడు. దీంతో హిత్రూ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 6, 2024
విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయి. దీనికో కారణం ఉంది. ‘వైట్ పెయింట్ సూర్యరశ్మిని గ్రహించదు. గాల్లో ఉన్నప్పుడు, నేలపై పార్క్ చేసి ఉంచినప్పుడు తెలుపు రంగు క్యాబిన్లో వేడిని తగ్గిస్తుంది’ అని నిపుణులు చెబుతున్నారు. డార్క్ పెయింట్తో పోల్చితే వైట్ తేలికైనది. డార్క్ కలర్ వేయడం వల్ల విమానం 8 మంది ప్రయాణికులంత బరువు ఎక్కువవుతుంది. తెలుపు రంగు వల్ల గాల్లో పక్షులు ఢీ కొట్టడం తగ్గుతుంది.
News October 6, 2024
మాది పొయ్యి వెలిగించే హిందూత్వ.. బీజేపీదేమో: శివసేన UBT
తమ హిందూత్వ ఇంట్లో పొయ్యి వెలిగిస్తే BJP హిందూత్వ ఏకంగా ఇంటికే నిప్పు పెడుతుందని శివసేన UBT నేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. అందుకే శివసేనను ఫినిష్ చేయాలనుకున్నారని ఆరోపించారు. మరో నెలలోనే మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలోకి వచ్చాక ద్రోహులకు ఉద్యోగాలు ఉండవన్నారు. ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో లూటీ చేసిన తీరును ప్రజల ముందు ఉంచుతామన్నారు.
News October 6, 2024
సికింద్రాబాద్ నుంచి గోవా ట్రైన్ ప్రారంభం.. షెడ్యూల్ ఇదే
సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు(17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురువారం, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, MBNR, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. పూర్తి షెడ్యూల్ పై ఫొటోలో చూడండి.