News February 6, 2025

వికారాబాద్: అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తాం: అదనపు కలెక్టర్

image

అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతామని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు విధి విధానాలపై హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.గౌతం, చీఫ్ ఇంజినీర్ చైతన్య కుమార్‌తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్‌లు, హౌసింగ్ ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్‌లకు పలు సూచనలు, సలహాలు చేశారు.

Similar News

News December 28, 2025

‘డిజిటల్ అరెస్ట్’ మోసాలపై వరంగల్ పోలీసుల హెచ్చరిక

image

డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు సాగిస్తున్న మోసాల పట్ల వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలను హెచ్చరించింది. సీబీఐ, పోలీస్ అధికారులమని నమ్మిస్తూ వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. చట్టపరంగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే ప్రక్రియ లేదని, ఇలాంటి కాల్స్ వస్తే భయపడకూడదని స్పష్టం చేశారు. బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు.

News December 28, 2025

UGC-NET అడ్మిట్ కార్డులు విడుదల

image

డిసెంబర్ సెషన్‌కు సంబంధించి UGC-NET అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. NETకు అప్లై చేసుకున్న వారు https://ugcnet.nta.nic.in/లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 85 సబ్జెక్టులకు సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 31, జనవరి 2, 3, 5, 6, 7తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. NET అర్హత సాధించడం ద్వారా JRF, డిగ్రీ, పీజీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించవచ్చు.

News December 28, 2025

నిర్మలా సీతారామన్‌కు సైకత శిల్పంతో స్వాగతం

image

నరసాపురం మండలం పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రామ అభివృద్ధి ప్రదాత నిర్మలా సీతారామన్‌కు సుస్వాగతం’ అంటూ రూపొందించిన సైకత శిల్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తీర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.