News February 6, 2025
MDCL: అకౌంట్లలో రైతు భరోసా పడుతోంది: DAO

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 4825 మంచి రైతులకు సంబంధించి రూ.3.74 కోట్లు ట్రెజరీకి పంపగా, గ్రామసభలు జరిగిన తెల్లారి 2706 మంది రైతులకు రూ.3.13కోట్ల రైతుల భరోసా అకౌంట్లలో జమైందని DAO చంద్రకళ తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఏ రైతూ కంగారు పడాల్సిన అవసరం లేదని, సాగుకు యోగ్యమైన మిగతా రైతులందరికీ రైతు భరోసా పడనుందని పేర్కొన్నారు.
Similar News
News September 18, 2025
అఫ్జల్సాగర్లో గల్లంతు.. భీమలింగం బ్రిడ్జిపై లభ్యం

వలిగొండ (మం) సంగం భీమలింగం బ్రిడ్జిపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అఫ్జల్సాగర్ నాలాలో 4రోజుల క్రితం గల్లంతైన అర్జున్ మృతదేహంగా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరారు.
News September 18, 2025
HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్బాడీ లభ్యం

అఫ్జల్సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.