News February 6, 2025
MDCL: అకౌంట్లలో రైతు భరోసా పడుతోంది: DAO

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 4825 మంచి రైతులకు సంబంధించి రూ.3.74 కోట్లు ట్రెజరీకి పంపగా, గ్రామసభలు జరిగిన తెల్లారి 2706 మంది రైతులకు రూ.3.13కోట్ల రైతుల భరోసా అకౌంట్లలో జమైందని DAO చంద్రకళ తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఏ రైతూ కంగారు పడాల్సిన అవసరం లేదని, సాగుకు యోగ్యమైన మిగతా రైతులందరికీ రైతు భరోసా పడనుందని పేర్కొన్నారు.
Similar News
News November 4, 2025
HYD: హైవే బలి తీసుకుంది!

ఆలస్యం అమృతం విషం.. HYD-బీజాపూర్ హైవేకు ఈ సామెత సరిపోతుంది. 2022లో శంకుస్థాపన చేసిన పనులు రెండ్రోజుల క్రితం ప్రారంభమవడం గమనార్హం. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటోందని గతంలో NGTకి పిటిషన్ రాగా.. సుధీర్ఘ విచారణ అనంతరం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈలోపు జరగాల్సిన అనార్థాలు జరిగాయి. నిన్న మీర్జాగూడ యాక్సిడెంట్ ఇందులో భాగమైంది. కానీ, ఐదేళ్లలో ఈదారిలో 200 మందికిపైగా చనిపోవడం ఆందోళనకరం.
News November 4, 2025
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.7,555

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
News November 4, 2025
విశాఖ: ‘పీఏ’లే పెత్తందారులు.. పనిని బట్టి పైసలు..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న పలువురు పర్సనల్ అసిస్టెంట్లు పెత్తందారులుగా మారిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత GOVTలోనూ ఇలానే ఉండేదని, ఇప్పుడూ తీరు మారలేదని పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. ప్రజాప్రతినిధులను కలవాలంటే PAలను ప్రసన్నం చేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. పనిని బట్టి పైసలు వసూలు చేస్తున్నారని టాక్. వీరిని కట్టడి చేయకపోతే నాయకులకే నష్టమన్న చర్చ నడుస్తోంది.


