News February 6, 2025

ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి: నంద్యాల కలెక్టర్

image

బాధ్యతలు స్వీకరించిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో అనుకూల దృక్పథం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి వెల్లడించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ హాల్‌లో లైఫ్ కోచ్ మోటివేషన్ స్పీకర్ డాక్టర్ ఎన్.రాంబాబు స్ట్రేస్ మేనేజ్‌మెంట్, పాజిటివ్ థింకింగ్‌పై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంబాబు మానసిక ఒత్తిడి, శారీరిక ఒత్తిడి తగ్గించుకునే అంశాలపై క్షుణ్ణంగా వివరించారు.

Similar News

News January 20, 2026

జనగామ: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త

image

మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ నుంచి 130 స్పెషల్ బస్సులు ఉంటాయని డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. ఈనెల 25 నుంచి 31 వరకు ఆర్టీసీ బస్సులు మేడారం అమ్మవారి గద్దెల వరకు వెళతాయన్నారు. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ వర్తిస్తుందని, ఈ సదావకాశాన్ని జనగామ పరిసర ప్రాంతాల భక్తులు వినియోగించుకోవాలని కోరారు.

News January 20, 2026

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచులు పనిచేయాలి: మంత్రి

image

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా నూతన సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాదులని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.

News January 20, 2026

భూపాలపల్లి: TG CET-2026 గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్ నేటితో ముగింపు

image

గురుకులాల ప్రవేశాలకు సంబంధించిన TG CET-2026 నోటిఫికేషన్ నేటితో ముగియనుంది. ఐదో తరగతి కామన్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9వ తరగతుల బ్యాక్‌లాగ్ సీట్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గురుకుల విద్య ద్వారా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందుతుందని తెలిపారు.