News March 19, 2024

CAA: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

image

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. కాగా దీనికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 9న తదుపరి విచారణ చేస్తామని సుప్రీం వెల్లడించింది. స్టే ఇవ్వకపోవడంతో CAA అమలు కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఈ చట్టం ఎవరి పౌరసత్వాన్ని లాక్కోదని మెహతా వివరించారు.

Similar News

News April 20, 2025

చంద్రబాబుకు మోదీ, రేవంత్, చిరు శుభాకాంక్షలు

image

‘నా మిత్రుడు, CM చంద్రబాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని PM మోదీ పోస్ట్ చేశారు. ‘నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ AP అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి’ అని TG సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ‘కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలి’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.

News April 20, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండాయి. నిన్న 78,821 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 33,568 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చింది.

News April 20, 2025

IPL: CSK ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

CSK ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో ఉంది. ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి కేవలం రెండింట్లోనే గెలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. ప్రస్తుతం ధోనీ సేన NRR -1.276గా ఉంది. ఇది మెరుగవ్వాలంటే భారీ తేడాలతో మ్యాచులు గెలవాలి. CSK ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనుకుంటున్నారా? మీ కామెంట్.

error: Content is protected !!