News February 6, 2025
ఔదార్యం చాటుకున్న ఖానాపూర్ మహిళా పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738767255935_50031511-normal-WIFI.webp)
ఖానాపూర్ పట్టణంలో బుధవారం మహిళా పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. మల్లీశ్వరి, నర్సమ్మ పట్టణంలో విధలు నిర్వహిస్తుండగా బట్టలు లేకుండా తిరుగుతున్న మతిస్థిమితం లేని ఓ మహిళకు బట్టలు అందజేసి భోజనం పెట్టించారు. అనంతరం ఆమె వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Similar News
News February 6, 2025
విజయనగరం: మొన్న మూడు.. నిన్న నిల్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738803800376_52150088-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా.. బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
News February 6, 2025
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738029385955_893-normal-WIFI.webp)
TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
News February 6, 2025
NLG: ఇంటర్ ప్రాక్టికల్స్కు 357 మంది గైర్హాజరు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738803466339_691-normal-WIFI.webp)
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు బుధవారం 357 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్కు మొత్తం 2760 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2507 మంది హాజరయ్యారు. 253 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్కు 1985 మంది హాజరుకావాల్సి ఉండగా 1881 మంది పరీక్ష రాశారు. 104 మంది గైర్హాజరయ్యారు.