News February 6, 2025
MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త

సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.
Similar News
News November 13, 2025
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్గా కరీంనగర్

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.
News November 13, 2025
గద్వాల: డీకే అరుణకు కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు

మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు 2025పై వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లో ఆమెను సభ్యురాలిగా నియమించారు. జమ్మూ కశ్మీర్ పునశ్చరణ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాలనూ ఈ కమిటీ పరిశీలిస్తుంది.
News November 13, 2025
నిర్మల్లో జిల్లా స్థాయి నెట్బాల్ జట్ల ఎంపిక

నిర్మల్ NTR మినీ స్టేడియంలో నవంబర్ 15న U-14, U-17 బాల, బాలికల నెట్బాల్ జిల్లా జట్టు ఎంపిక నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, SGF కార్యదర్శి ఎ.రవీందర్ గౌడ్ తెలిపారు. పాల్గొనేవారు ఆ రోజు ఉదయం 9 గంటలకు బోనాఫైడ్, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం ప్రోగ్రెస్ కార్డ్, ఆధార్ జిరాక్స్లతో హాజరుకావాలని గురువారం ఓ ప్రకటనలో సూచించారు.


