News February 6, 2025
MNCL: సింగరేణిలో డిపెండెంట్లకు శుభవార్త
సింగరేణి కంపెనీలో డిపెండెంట్ల వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో పనిచేస్తూ మృతి చెందడంతో పాటు మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల వారసులకు 2018 మార్చి 9 నుంచి ఈ గరిష్ట వయోపరిమితి సడలింపు స్కీమ్ వర్తించనుంది. దీనివల్ల 2018 నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి తక్షణ ప్రయోజనం చేకూరనుండగా రానున్న రోజుల్లోనూ మరింత మందికి లబ్ధి చేకూరుతుంది.
Similar News
News February 6, 2025
చర్లలో ఉరేసుకుని యూపీ వాసి మృతి
బాత్రుంలో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. UP చౌటీర్యాలీకి చెందిన అమర్ సింగ్ పానీపూరి బండితో జీవనం సాగిస్తున్నాడు. గత 2 రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్నాడు. మనస్తాపంతో బాత్రూంలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్రూం నుంచి బయటికి రాకపోయేసరికి భార్య ప్రీతి వెళ్లి చూడగా ఉరేసుకుని ఉన్నాడు.
News February 6, 2025
విజయవాడ: డిజిటల్ అరెస్టుతో భారీ మోసం
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 కోట్లు దోచేశారు. భారతీ నగర్కు చెందిన ఓ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు మీపై కేసు నమోదైందంటూ ఆ వ్యక్తి నుంచి రూ.3.46 లక్షలు ఓసారి, రూ.కోటి మరోసారి, ఆ తర్వాత రూ.25 లక్షలు, రూ.2 లక్షలు, రూ.20 లక్షలు జమ చేయించుకున్నారు. దీంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగదు BNGLR, HYD, KOLAKATAలలో బ్యాంకుల్లోకి వెళ్లినట్లు తేలింది.
News February 6, 2025
నల్గొండ: శుభకార్యాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులు
TGS RTC నల్గొండ రీజియన్లోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన బస్సులు అందజేస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జానీ రెడ్డి తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు. వివరాలకు సమీప డిపోలను సంప్రదించాలని సూచించారు.