News February 6, 2025

పనులను త్వరగా పూర్తి చేయాలి: ASF అదనపు కలెక్టర్

image

జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన పనులను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్‌ఛార్జి జిల్లా విద్యాశాఖ అధికారి గమ్మనియల్‌, హెచ్ఎంలతో కలసి సమీక్ష నిర్వహించారు.

Similar News

News March 18, 2026

పెద్దపల్లి: ‘మూడు విడతల్లో రైతు భరోసా’

image

యాసంగి రైతు భరోసా నిధులు మూడు విడతల్లో జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. CM రేవంత్ రెడ్డి ఈ నెల 22న సిద్దిపేటలో ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో 1,51’300 మంది రైతుల ఖాతాలో రూ. 162.52 కోట్లు నిధులు ఏప్రిల్ నెలాఖరులోగా జమ అవుతాయన్నారు. ఫిబ్రవరి 28 నాటికి పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన రైతులు నూతనంగా రైతు భరోసా కోసం AEO ల వద్ద మార్చి 25 లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 18, 2026

భువనగిరి: పీఎం కిసాన్ పథకానికి ఈ రైతులు దూరం..!

image

భువనగిరి జిల్లాలో సుమారు 2.85 లక్షల మంది రైతులు ఉండగా, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 25 వేల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. 2019 తర్వాత కేంద్రం కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వకపోవడంతో వీరు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. గత ఏడేళ్లలో జిల్లాలో సుమారు 30 వేల మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమనార్హం.

News March 18, 2026

HYD: రీల్స్‌లో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారా.. జాగ్రత్త!

image

SM వేదికగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సెక్యూరిటీ గార్డు వెంకన్నను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు చెందిన సోషల్ మీడియా ‘రీల్’ కింద ఇతడు అత్యంత అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ PSకి తరలించి విచారణ చేస్తున్నారు.