News February 6, 2025

దరఖాస్తు గడువు పెంపు

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.

Similar News

News February 6, 2025

కొత్త అగాఖాన్ ఎవరంటే..

image

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కరీమ్ అల్-హుసేనీ (49వ అగాఖాన్) నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన తదనంతరం 50వ అగాఖాన్‌గా ఆయన తనయుడు రహీమ్(53 ఏళ్లు) అల్-హుసేనీ కొనసాగుతారని అగాఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ ప్రకటించింది. అగాఖాన్‌ను మహ్మద్ ప్రవక్తకు ప్రత్యక్ష వారసుడిగా, ఇమామ్‌గా ఇస్మాయిలీ ముస్లింలు భావిస్తారు. 50 తరాలుగా ఆ కుటుంబం తరఫున అగాఖాన్ నియామక సంప్రదాయం కొనసాగుతోంది.

News February 6, 2025

ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచుకోవచ్చు: కమిషన్

image

TG: ప్రైవేటు స్కూళ్లు ఏడాదికోసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులివే: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయుల్లో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలుండాలి. ఇవి ఫీజుల్ని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు. ఫీజుల వివరాలను అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలి.

News February 6, 2025

ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ కొత్త నిబంధన

image

తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలను అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 8వేల మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లేవారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. కచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్‌తో కలిసి వెళ్లాలని సూచించింది. 8వేల అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ తాజా నిబంధన తీసుకొచ్చింది.

error: Content is protected !!