News February 6, 2025
ఇవాళ CLP సమావేశం.. కీలక అంశాలపై చర్చ
TG: కాంగ్రెస్ శాసనసభాపక్షం(CLP) ఇవాళ సమావేశం కానుంది. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో CM రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. MLC ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.
Similar News
News February 6, 2025
కాంగ్రెస్ రాకతో పాత కష్టాలు: కేటీఆర్
TG: రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ Xలో విమర్శించారు. గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలని రాసుకొచ్చారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
News February 6, 2025
నర్సు నిర్వాకం.. గాయానికి కుట్లకు బదులు పెవిక్విక్
మనకు ఏదైనా గాయమైతే వైద్యులు కుట్లు వేస్తారు. అయితే కర్ణాటక హవేరి(D)లోని అడూర్ PHCలో స్టాఫ్ నర్స్ జ్యోతి ఫెవిక్విక్తో చికిత్స చేసింది. ఏడేళ్ల బాలుడి చెంపకు గాయమవడంతో పేరెంట్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నర్సు గాయానికి కుట్లు వేస్తే మచ్చలు పడతాయని చెప్పి ఫెవిక్విక్ రాసి బ్యాండేజ్ వేసింది. పేరెంట్స్ అభ్యంతరం చెప్పినా వినలేదు. ఈ ఘటనపై వారు చేసిన ఫిర్యాదుతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు.
News February 6, 2025
బంగ్లా పితామహుడి ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్ పితామహుడిగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిని బంగ్లా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. దేశంలోని తమ అవామీ లీగ్ కార్యకర్తలందరూ ఏకమై మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై తిరగబడాలని మాజీ ప్రధాని హసీనా ఆన్లైన్ వీడియోలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, బంగబంధు రెహమాన్ భవనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు.