News February 6, 2025
కోనసీమలో బైక్ దొంగలు దొరికారు..!

కోనసీమలో బైకులను అపహరిస్తున్న వారిని అరెస్ట్ చేశామని అమలాపురం డీఎస్పీ SKVD ప్రసాద్ వెల్లడించారు. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన 13 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆరుగురు పట్టుబడగా.. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన ముగ్గురిని రిమాండ్కు పంపారు. అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు.
Similar News
News March 6, 2026
130+ గంటలుగా ఇరాన్ ఆఫ్లైన్!

ఇజ్రాయెల్-USతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్లో 130+ గంటలుగా ఇంటర్నెట్ నిలిచిపోయింది. 1 % మాత్రమే ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని ఇంటర్నెట్ మానిటరింగ్ గ్రూప్ నెట్ బ్లాక్స్ తెలిపింది. అటు గ్లోబల్ ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నవారికి టెలీ కమ్యూనికేషన్ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు చెప్పింది. భద్రతాపరమైన కారణాలతో అంతర్గత విషయాలు లీక్ కాకుండా ఇలా చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
News March 6, 2026
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయంటే!

కామారెడ్డి జిల్లాలో ఆయా ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు(ఎల్లో అలెర్ట్) నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్పుగొండ 38.1°C, సోమూరు, భిక్కనూరు 38, సదాశివనగర్, కొల్లూరు 37.7, నాగిరెడ్డిపేట, మాచాపూర్ 37.6, బీర్కూరు 37.5, దోమకొండ 37.4, మేనూరు, బీబీపేట 37.1, లచ్చపేట 37, డోంగ్లి 36.9, ఆర్గొండ, పుల్కల్ 36.8, బిచ్కుంద, పాతరాజంపేట 36.7, బొమ్మన్ దేవిపల్లి 36.6°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 6, 2026
అమరావతిలో ‘నైలిట్’ కేంద్రం ఏర్పాటు

అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ (నైలిట్) కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. నైలిట్ ప్రతినిధులు డా.జయరాజ్, డా.లక్ష్మణ్ కొర్రా ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ముందుగా తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాల్లో డిజిటల్ నైపుణ్యాలు, మెరుగైన శిక్షణ అందుబాటులోకి రానున్నాయి


