News February 6, 2025
ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ సత్తా చాటాలి: రేగా కాంతారావు
ఇల్లందు: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది జిల్లాలోనే కాదు రాష్ట్రంలో సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇలా ఏ ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Similar News
News February 6, 2025
పరీక్షా పే చర్చా: అతిథులుగా సద్గురు, దీపిక, అవని..
విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు PM మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రోగ్రామ్ ‘పరీక్షా పే చర్చా’. FEB 28న ఈ ఈవెంట్ గతానికి భిన్నంగా మరింత ఆసక్తికరంగా జరగనుంది. మోదీతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు స్టూడెంట్స్తో మమేకం కానున్నారు. సద్గురు జగ్గీవాసుదేవ్, దీపికా పదుకొణె, విక్రాంత్ మాసె, భూమి ఫెడ్నేకర్, మేరీ కోమ్, అవనీ లేఖర, రుజుతా దివేకర్, సోనాలీ సబర్వాల్, రాధికా గుప్తా అతిథులుగా వస్తున్నారు.
News February 6, 2025
ఈరోజు మ్యాచ్లో విరాట్, రోహిత్ ముంగిట రికార్డులివే
నేటి ODI మ్యాచ్లో భారత ప్లేయర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరో 94 రన్స్ చేస్తే విరాట్ వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా దాటిన ప్లేయర్ అవుతారు. 12 రన్స్ చేస్తే ఇంగ్లండ్పై అంతర్జాతీయ మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడవుతారు. ఇక రోహిత్ 11వేల వన్డే రన్స్ పూర్తి చేయడానికి 134 పరుగుల దూరంలో ఉన్నారు. 24 రన్స్ చేస్తే ODIల్లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ 10లోకి చేరుకుంటారు.
News February 6, 2025
గజ్వేల్లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)
GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.