News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News March 25, 2026

జన్నారం: ఇద్దరు అటవీ అధికారులు సస్పెండ్

image

కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్‌లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది. బీట్ ఆఫీసర్ లవన్ కుమార్, డీఆర్‌ఓ కుమారస్వామిని సస్పెండ్ చేసినట్లు ఎఫ్డీఓ రామ్మోహన్ బుధవారం ప్రకటించారు. అటవీ దొంగలకు సహకరించినా, విధుల్లో అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అడవుల సంరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

News March 25, 2026

టీనేజ్ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

అప్పటివరకు సంతోషంగా, చురుగ్గా ఉండే కొందరు పిల్లలు కాలేజీకి వెళ్లగానే సైలెంట్‌ ఐపోతారు. పిల్లల ప్రవర్తనలో ఇలాంటి మార్పును వెంటనే గుర్తించాలంటున్నారు నిపుణులు. వేధింపులకు గురవుతున్నారేమో పరిశీలించాలి. ఫ్రెండ్లీగా మాట్లాడి సమాచారం రాబట్టాలి. భయాన్ని పోగొట్టి, తామున్నామనే భరోసా, నమ్మకాన్ని తల్లిదండ్రులు కలిగించాలి. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సూచిస్తున్నారు.

News March 25, 2026

WGL: పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు: అధికారులు

image

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు తెలిపారు. సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెప్పారు. కొన్ని బంక్‌ల వద్ద కనిపిస్తున్న క్యూలు వదంతుల వల్ల ప్రజలు ఆందోళనగా కొనుగోలు చేయడంతోనే ఏర్పడ్డాయని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు.