News February 6, 2025

ఉమ్మడి MBNR జిల్లాలో రైతు భరోసా జమ.!

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాకు 78,403 రైతులకు గాను రూ.38,15,09,916 జమయ్యాయి. NRPTకు 45,717 రైతులకు గాను రూ.26,94,06,431, NGKLకు 78,490 రైతులకు గాను రూ.44.79.99.371 జమయ్యాయి. వనపర్తి జిల్లాకు 60,239 రైతులకు గాను రూ.28,02,01,581, గద్వాలకు 37,352 రైతులకు గాను రూ.23,86,06,138 అధికారులు జమ చేశారు.

Similar News

News November 6, 2025

ఖతార్‌లో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా?

image

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఖతార్‌లో సూపర్‌వైజర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, టెక్నికల్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు ఇవాళ్టి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెలకు రూ.1,94,000 నుంచి రూ.2,38,000 వరకు చెల్లిస్తారు. వయసు 45ఏళ్ల లోపు ఉండాలి. వెబ్‌సైట్: https://naipunyam.ap.gov.in/

News November 6, 2025

వరంగల్ నిట్‌లో ఉచితంగా GATE కోచింగ్

image

వరంగల్‌ నిట్(NIT)లో ఎస్సీ-ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచితంగా GATE కోచింగ్ నిర్వహిస్తున్నట్లు సెల్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 2026 జనవరి 9 వరకు ఈ కోర్సు 8 వారాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వివరాల కోసం ఎస్సీ-ఎస్టీ సెల్, నిట్ వరంగల్‌ను సంప్రదించాలని కోరారు.

News November 6, 2025

ఖమ్మం: పత్తి మిల్లుల నిరవధిక సమ్మె వాయిదా

image

తెలంగాణలోని కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, దీంతో నవంబర్ 6న జరగాల్సిన నిరవధిక బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు టీజీ కాటన్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలపై కేంద్రానికి లేఖ పంపినట్లు తెలిపింది. 2, 3 రోజుల్లో 75% మిల్లులు ప్రారంభమవుతాయని CCI బ్రాంచ్ మేనేజర్లు చెప్పడంతో.. కొనుగోలు కేంద్రాలు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.