News February 6, 2025

HYD: ఫిబ్రవరి 17 వరకు నుమాయిష్

image

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. నాంపల్లి మైదానంలో నిర్వహిస్తున్న నుమాయిష్‌ను మరో రెండు రోజులు పొడిగించారు. జనవరి 1కి బదులు 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉంది. అయితే, రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 17న ముగుస్తుందని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తెలిపారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT

Similar News

News March 25, 2026

రెండుగా విడిపోనున్న ‘కరీంనగర్’..?

image

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం KNR, KNR రూరల్, కొత్తపల్లి మండలాలతో ఒక నియోజకవర్గంగా ఉంది. KNR మండలాన్ని ఒక నియోజకవర్గంగా, కొత్తపల్లి, KNR రూరల్ మండలం కలిపి మరో నియోజకవర్గమయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

News March 25, 2026

నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

News March 25, 2026

వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

image

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్‌ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.