News February 6, 2025

ఎండాకాలం వచ్చేసింది

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి వేడి పెరిగింది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరిగింది. రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో 15,582 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది అదేరోజు 13,276 మెగావాట్ల వినియోగం నమోదవడం గమనార్హం. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు ఉంటున్నాయి. మరో వారంలో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Similar News

News February 6, 2025

2027లో చంద్రయాన్-4 లాంచ్

image

చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.

News February 6, 2025

విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్

image

AP: విజయ‌సాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.

News February 6, 2025

రేపు ‘జాక్’ టీజర్

image

డీజే టిల్లూతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ సిినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్ రేపు ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. సిద్ధూ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ప్రకటించింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది.

error: Content is protected !!