News February 6, 2025

రుణం కంటే రెట్టింపు వసూలు.. విజయ్ మాల్యా పిటిషన్

image

బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.6,200 కోట్ల అప్పునకు బ్యాంకులు రూ.14,131 కోట్ల ఆస్తులను రికవరీ చేశాయని తెలిపారు. అయినా ఇంకా జప్తు కొనసాగుతోందని, దీనిపై స్టే విధించాలని కోరారు. ఈ అంశంపై ఈ నెల 13లోగా స్పందించాలని న్యాయస్థానం 10 బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది.

Similar News

News January 19, 2026

వరిలో సుడిదోమ – నివారణకు కీలక సూచనలు

image

వరి కంకులు ఏర్పడే దశలో సుడిదోమ ఆశించడం వల్ల ఆకులు వాడిపోయి, మొక్క ఎదుగుదల ఉండదు. కంకులపై దాడి వల్ల కంకులు గోధుమ రంగులో, నల్లటి చీలిన గింజలతో కనిపిస్తాయి. ఫలితంగా పంట నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గుతుంది. సమస్య తీవ్రమైతే మొక్కలు చనిపోతాయి. సుడిదోమ నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 75 S.P 1.5 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్+ఎథిప్రోల్ 80 WG 0.25గ్రా. లేదా పైమెట్రోజైన్ 50 WG 0.6 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.

News January 19, 2026

మాఘమాసం ప్రారంభం.. ఇవి అలవరుచుకోండి!

image

మాఘమాసం అంటే పాపాలను హరించేది అని అర్థం. ఆధ్యాత్మిక చింతనకు ఇది ఎంతో శ్రేష్ఠమైన కాలమని పండితులు అంటున్నారు. ‘విష్ణువు, సూర్య భగవానుడు, శివుడికి ఈ నెల ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. పురాణ పఠనం, జపం, దానధర్మాలు, తర్పణం, హోమం చేయడం పుణ్యప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ఈ నెలలో మాఘ ఆదివారం నోము, మాఘ గౌరీ నోము చేస్తారు’ అని చెబుతున్నారు.

News January 19, 2026

పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

image

AP: పోలవరం పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఆ బృందం పర్యటిస్తుంది. కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇవాళ ప్రాజెక్టులో గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు మెయిన్ డ్యామ్‌లో గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలు, 21న స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలిస్తారు.