News February 6, 2025
ఆదిలాబాద్: రెండో భార్యను చంపిన భర్త

అనుమానంతో వ్యక్తి రెండో భార్యను హత్యచేశాడు. ఈఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్లో జరిగింది. పోలీసుల ప్రకారం.. గ్రామానికి చెందిన మరోతికి ఇద్దరు భార్యలు. ఈక్రమంలో రెండో భార్య అయిన రుక్కుబాయికి వివాహేత సంబంధం ఉందని అనుమానం పెట్టుకున్నాడు. మద్యం తాగి వచ్చి గొడవ చేసేవాడు, చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో మంగళవారం రుక్కుబాయి(26) ఛాతిపై బండతో కొట్టి హత్య చేసి పారిపోయాడు. కేసు నమోదైంది.
Similar News
News January 9, 2026
సర్జరీ తర్వాత తిలక్ వర్మ ఫస్ట్ రియాక్షన్

యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ తన <<18802433>>హెల్త్ కండిషన్<<>> గురించి ఫ్యాన్స్కు అప్డేట్ ఇచ్చారు. రాజ్కోట్లో సర్జరీ చేయించుకున్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఇన్స్టా ద్వారా వెల్లడించారు. ‘మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను చాలా వేగంగా రికవర్ అవుతున్నాను. మీరు అనుకున్న దానికంటే ముందే గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు HYD చేరుకుని తిలక్ రీహబిలిటేషన్ ప్రాసెస్ మొదలుపెట్టనున్నారు.
News January 9, 2026
మే 3న నీట్.. సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం

జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మీ, నోడల్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
News January 9, 2026
రూ.425 కోట్లతో పెనుకొండలో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం

పెనుకొండలోని ఘనగిరి లక్ష్మీనరసింహ స్వామి కొండపై ₹425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక బేస్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 60 ఎకరాల్లో నిర్మించే ఈ కేంద్రంతో 4,035 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పెనుకొండకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


