News February 6, 2025

నగరి : నలుగురి మృతికి కారణమైన లారీ పట్టివేత

image

ఫిబ్రవరి 2న నగరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన లారీని ఎట్టకేలకు నగరి పోలీసులు ఛేదించారు. సిమెంట్ లారీ వేలూరుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి నుంచి చెన్నైకి సిమెంటు తరలించే లారీ తిరుపతి వైపు వెళ్తున్న బస్సును ఢీకొని నలుగురు చనిపోయిన ఘటనలో ఇద్దరు లారీ డ్రైవర్లను బాధ్యులుగా చూపుతూ కేసు నమోదు చేశారు.

Similar News

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 21, 2026

చిత్తూరు: ఐదుగురు DTలకు విధులు

image

గ్రూప్-2 పరీక్షల్లో DTలుగా ఎంపికైన వారిలో 16 మందిని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 5 మందిని కేటాయించగా వారిలో.. శివకుమార్, మదన్ మోహన్ రెడ్డి, యస్థాని బాషా, సుధాకర్, శశికిరణ్ ఉన్నారు. వీరు ఏడాది పాటు రెవెన్యూ విభాగంలో ప్రొబేషన్ కింద జిల్లాలో విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

News March 20, 2026

చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

image

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.