News February 6, 2025

కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి

image

కాలేజీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన తొండంగి మండలం సీతారాంపురంలో బుధవారం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె సుకన్య(3) మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి చనిపోయిందని గ్రామస్థులు, బంధువులు ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వారితో చర్చలు జరిపి ఆందోళన విరమింపజేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News July 7, 2025

వర్ధన్నపేట వైపే స్వర్ణ చూపు..!

image

వర్ధన్నపేట నియోజకవర్గం పదేళ్ల పాటు బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉంది. కానీ వినూత్న పరిణామాల వల్ల ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఈ స్థానం జనరల్‌గా మారుతుందనే ఊహాగానాలతో వరంగల్ నగర మాజీ మేయర్, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చూపు తన తన సొంత నియోజకవర్గ కేంద్రంపై పడిందనే చర్చ జరుగుతోంది.

News July 7, 2025

HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

image

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.

News July 7, 2025

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.