News March 19, 2024
వంగవీటి రాధా ప్రచారానికే పరిమితమా? పోటీ చేస్తారా?

AP: ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన తరఫున వంగవీటి రాధా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుగుతారని సమాచారం. అయితే టీడీపీలో టికెట్ దక్కనందున జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఇవాళ ఎంపీ బాలశౌరితో సమావేశం కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.
Similar News
News August 29, 2025
TODAY HEADLINES

* రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఫ్యామిలీ కార్డు: చంద్రబాబు
* ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్
* మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు: జగన్
* తెలంగాణ సీఎస్ పదవీకాలం పొడిగింపు
* హిందువులు ముగ్గురు పిల్లలను కనాలి: RSS చీఫ్
* మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రేపు సెలవు
* APకి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా
* అఖండ 2, రాజా సాబ్ సినిమా రిలీజ్ వాయిదా
* TG: రవాణాశాఖ ఆధ్వర్యంలోని చెక్పోస్టులు రద్దు
News August 29, 2025
BREAKING: చెక్ పోస్టులన్నీ రద్దు

TG: రవాణాశాఖ ఆధ్వర్యంలోని 14 బార్డర్ చెక్పోస్టులు, కామారెడ్డిలోని RTA చెక్ పోస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, అనవసరంగా ఆపడాలు వంటివి తగ్గి వాహనాలు వేగంగా కదులుతాయి. సమయం, ఇంధన ఖర్చులు తగ్గుతాయి. ఇదే సమయంలో వాహన పర్మిట్లను వాహనదారులు ఆన్లైన్లో తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ స్క్వాడ్ ద్వారా RTA అధికారులు పర్మిట్లను తనిఖీ చేస్తారు.
News August 29, 2025
శ్రీశైలంలో విరిగిపడిన కొండ చరియలు

భారీ వర్షాల ధాటికి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడటంతో శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది.