News February 6, 2025
పిన్నెల్లి అనుచరుణ్ని కోడి మాంసం పట్టించింది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738808032113_52098404-normal-WIFI.webp)
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురక కిషోర్ సినీ ఫక్కిలో హైదరాబాద్లో కొద్దిరోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి పరారీలో ఉన్న కిషోర్ కోడి మాంసం కోసం తన మొబైల్ నుంచి ఫోన్ పే వాడుతూ ఉండడం గుర్తించారు. పోలింగ్ రోజున అల్లర్లు, దాడులు, పాత కేసులు, తీవ్ర నేరారోపణలున్న కిషోర్ను హైదరాబాద్ జైపూరి కాలనీలో చికెన్ స్టాల్ వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Similar News
News February 6, 2025
సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738822546553_52088599-normal-WIFI.webp)
తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
News February 6, 2025
BNGR: చిక్కనంటున్న బాహుబలి దున్న.. డ్రోన్తో వేట
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738826575459_52242460-normal-WIFI.webp)
యాదాద్రి జిల్లాలో జనావాసాల మధ్య అడవి దున్న సంచరిస్తుండడంతో జిల్లా వాసులంతా భయపడుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ఎం మండలం పల్లెల శివారులో కనిపించిన అడవి దున్న.. ఉదయం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు శివారులో ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దున్న కోసం డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. అడవి దున్నను పట్టుకోవడంలో అటవీశాఖ అధికారులు కొంత విఫలమవుతున్నారని పలువురు మండిపడుతున్నారు.
News February 6, 2025
2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738831541834_1199-normal-WIFI.webp)
అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.