News February 6, 2025
RR: షాద్నగర్లో బంద్కు పిలుపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738776985809_51999507-normal-WIFI.webp)
శస్త్ర పాఠశాలలో నీరజ్ అనే విద్యార్థి స్కూల్ పై నుంచి దూకి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా నేడు షాద్నగర్ పట్టణంలోని అన్ని విద్యాసంస్థల బంద్కు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పాఠశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహాన్ సూచించారు.
Similar News
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830923419_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
సర్పంచ్ ఎన్నికలు: రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738823414807_705-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన రంగారెడ్డిలో అసెంబ్లీ నియోజకవర్గాలు 8, కార్పొరేషన్లు 3, మున్సిపాలిటీలు 15 ఉన్నాయి. ఇదిలా ఉంటే ZPTC-21, MPP-21, MPTC-232, గ్రామ పంచాయతీలు-526, వార్డులు 4896 ఉన్నాయి. గతంలో 257గా ఉన్న MPTCల సంఖ్యను 232కు అధికారులు తగ్గించారు. ఈ నెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
News February 6, 2025
HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738819718238_705-normal-WIFI.webp)
GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.