News February 6, 2025
పెద్దపల్లి: విషాదం.. కంటికి మోటార్ బోల్ట్ తగిలి వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738751158294_71685917-normal-WIFI.webp)
అంతర్గాం మండలం గోలివాడలోని కాళేశ్వర్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో భాగమైన పార్వతి పంప్-హౌస్ వద్ద బుధవారం దుర్ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంటకు చెందిన మెగా కంపెనీ కార్మికుడు గుండబోయిన సంపత్(25) తన విధులు నిర్వహిస్తుండగా, మోటార్ పంపు బోల్ట్ ఎగిరి కంటికి తగిలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. మృతుడి స్వస్థలం వరంగల్లోని దామెర గ్రామం.
Similar News
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830986829_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
గచ్చిబౌలిలో కాల్పులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్ (UPDATE)
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738830923419_705-normal-WIFI.webp)
గచ్చిబౌలి ప్రీజం పబ్ కాల్పుల కేసులో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాఫ్ట్వేర్ ఇంజినీర్ రంజిత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ను అరెస్టు చేశారు. అతడికి ఆశ్రయం ఇచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ చోరీ చేసిన డబ్బును రంజిత్ బ్యాంకు ఖాతాలో జమ చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
News February 6, 2025
బీసీ, ఎస్సీ వర్గీకరణలపై 2 సభలకు సీఎల్పీ నిర్ణయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738426758075_81-normal-WIFI.webp)
TG: CLP భేటీలో CM రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. BC కులగణన, SC వర్గీకరణలపై 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. SC వర్గీకరణపై నల్గొండలో, BC వర్గీకరణపై ఉత్తర తెలంగాణలో సభలకు ప్లాన్ చేశారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. అటు వీటిపై గ్రామ, మండల, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.