News February 6, 2025
కాజీపేట-విజయవాడ మార్గంలో 30 రైళ్ల రద్దు

మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
SP ఆధ్వర్యంలో పోలీసుల ఉక్కుపాదం

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో మార్చి నెలలో పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. 11,741 మంది అనుమానితులను తనిఖీ చేసి 18 మందిని గుర్తించారు. గంజాయి కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేసి 24 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలపై దాడుల్లో 179 మందిని అదుపులోకి తీసుకుని రూ.4.55 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News April 1, 2026
పాలమూరు: నేటి నుంచి పోలీసు యాక్ట్

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.
News April 1, 2026
సిరిసిల్ల సిస్ కార్యాలయాన్ని ఓవర్సీస్ చేసుకున్న ఎన్పీడీసీఎల్

సిరిసిల్ల సెస్ కార్యాలయాల లైసెన్స్ మార్చి 31 వరకు ముగిసింది. దీనిపై NPDCL సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. లైసెన్స్ కాలం ముగిసినందున టి.జి.ఆర్.సీ ఆదేశాల ప్రకారం ఓవర్సీస్ చేసుకోవడం జరిగిందని, తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లైసెన్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు రైతులు, గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అని అన్నారు.


