News February 6, 2025
జానకిరాంపురం పీఏసీఎస్ సిబ్బంది సస్పెన్షన్: సీఈవో వర్మ

రోలుగుంట మండలం జానకిరాంపురం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యదర్శి బి. రామకృష్ణ, గుమస్తా మడక దేవుడును సస్పెండ్ చేసినట్లు డీసీసీబీ సీఈవో వర్మ తెలిపారు. సొసైటీ నిధులు దుర్వినియోగంతో పాటు నర్సీపట్నం డీసీసీబీలో <<15362575>>పెట్రోల్తో దాడి <<>>చేసిన ఘటన నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారని తెలిపారు.
Similar News
News March 22, 2026
హనుమకొండలో ఎక్కువ.. వరంగల్లో తక్కువ!

ఉమ్మడి వరంగల్లో క్షయ వ్యాధి కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలో ఈఏడాది 890 కొత్త కేసులు నమోదయ్యాయి. వరంగల్లో 289 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. వరంగల్ టీబీ సెంటర్లో వైద్యుల కొరత కారణంగానే కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
News March 22, 2026
‘ASFలో నియంత్రణ లేని బోర్లు.. నీటి సంక్షోభం భయం’

ఆసిఫాబాద్ జిల్లాలో బోర్వెల్ త్రవ్వకాలు నియంత్రణ లేకుండా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారని సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ త్రవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు.
News March 22, 2026
అరకు వ్యాలీ మ్యూజియంలో పర్యాటకుల రద్దీ

అరకు ట్రైబల్ మ్యూజియంలో ఆదివారం రోజు భారీగా సందర్శకులు తరలివచ్చారు. వీకెండ్స్ కావడంతో పర్యాటకులు అధికంగా చేరుకొని, మ్యూజియం పరిసరాల్లో రద్దీగా మారాయి. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చుపించారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల నుంచి వీక్షకులు రావడంతో మ్యూజియంలో సందడి వాతావరణం నెలకొంది.


