News February 6, 2025
సిద్దిపేట: గురుకుల ప్రవేశాలకు నేడే లాస్ట్

రాష్ట్రంలోని గురుకులాల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారులు సూచించారు. 2025–26లో ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతిలో ఖాళీలు, 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News October 31, 2025
RSSను బ్యాన్ చేయాల్సిందే: ఖర్గే

దేశంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టిస్తున్నందుకు RSSను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి, ఇందిరా గాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ మ్యాన్, ఐరన్ లేడీ ఇద్దరూ భారతదేశ ఐక్యత, సమగ్రత కోసం పని చేశారని చెప్పారు. దేశంలో చాలా సమస్యలకు BJP-RSSనే కారణమని ఆరోపించారు. 1948లో గాంధీ హత్య తర్వాత RSSను పటేల్ నిషేధించారని చెప్పారు.
News October 31, 2025
విడిపోతున్నారా? పిల్లలు జాగ్రత్త

దంపతులు తమ విడాకుల విషయాన్ని చెబితే పిల్లలు ఎంతోకొంత ఒత్తిడికి గురవడం సహజం. కొందరు చిన్నారులు పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకుంటే.. మరికొందరికి సమయం పడుతుంది. కాబట్టి త్వరగా అర్థం చేసుకోమని, మారమని వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఆయా పరిస్థితులకు తగినట్లుగా అడ్జస్ట్ అయ్యే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ఓర్పు, నేర్పు వస్తుందంటున్నారు నిపుణులు.
News October 31, 2025
మెదక్తో ఇందిరాగాంధీకి అవినాభావ సంబంధం

మెదక్ ఎంపీగా గెలుపొందిన ఇందిరాగాంధీకి ఉమ్మడి జిల్లాలో అవినాభావ సంబంధం ఉంది. ఎంపీగా మెదక్కు వచ్చి వెళ్లేటప్పుడు చిన్నశంకరంపేట అతిథి గృహంలో బస చేసినట్లు స్థానిక నాయకులు ఆనాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. అలాగే 984లో జరిగిన మెదక్ జిల్లా కాంగ్రెస్ సర్పంచ్ల సదస్సు, సంగారెడ్డిలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మెదక్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు.


