News February 6, 2025
వికారాబాద్: లగచర్లలో మరోసారి భూ సర్వే

దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి భూ సర్వేను చేపట్టనున్నట్లు తహశీల్దార్ కిషన్ పేర్కొన్నారు. పులిచెర్లకుంట, రోటిబండ తండా గ్రామాల్లో అసైన్డ్ భూములను సేకరించనున్నామని స్పష్టం చేశారు. కావున ఆయా ప్రాంతాల రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 7, 2025
NRPT: రేపు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం

రేపు సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని ప్రజలు తమ సమస్యలను 08506 281182 ఫోన్ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. సమస్యలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పరు. జిల్లా ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News December 7, 2025
KMR: కేంద్ర మంత్రిని కలిసిన పైడి ఎల్లారెడ్డి

హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు డా.పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల్లో జరుగుతున్న సర్పంచి ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను ఆయనకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇరువురు చర్చించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలను ప్రజలకు చేరువ చేసి, పార్టీ పటిష్టత పెంచే కార్యక్రమాలు చేయాలన్నారు.
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.


