News February 6, 2025

MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

image

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.

Similar News

News March 24, 2026

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18కి పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

image

2011 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుండటంతో ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు, పునర్విభజన తర్వాత 17 లేదా 18కి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల సంఖ్య 179కి చేరితే, జనాభా ప్రాతిపదికన ఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 నుంచి 6 నియోజకవర్గాలు అదనంగా ఏర్పడే అవకాశం ఉంది.

News March 24, 2026

ముంబైకి సూర్యను కెప్టెన్ చేయాలి: అశ్విన్

image

MI కెప్టెన్సీని సూర్యకు అప్పగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల <<19453220>>మాజీ క్రికెటర్ శ్రీకాంత్<<>>, తాజాగా అశ్విన్ ఇవే కామెంట్స్ చేశారు. ‘హార్దిక్ మంచి నాయకుడే. కానీ MIకి వచ్చాక తొలి ఏడాది రోహిత్ వ్యవహారంతో గడిచిపోయింది. ప్రస్తుతం భారత T20 జట్టు కెప్టెన్ సూర్య IPLలో హార్దిక్ నాయకత్వంలో ఆడాలి. ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.
* MI కెప్టెన్‌గా ఎవరు బెటర్? కామెంట్ చేయండి.

News March 24, 2026

రూపాయి లాభం లేక.. రోజుకు రూ. కోట్లలో నష్టం

image

అంతర్జాతీయంగా యుద్ధ ప్రభావం, ఎగుమతులు నిలిచిపోవడంతో ఉమ్మడి జిల్లాలో కోడిగుడ్డు ధరలు పతనమై పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి రూ.4.60 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో కేవలం రూ.3.50 మాత్రమే పలుకుతుండటంతో రైతులకు ఒక్కో గుడ్డుపై రూ. 1.10 నష్టం వాటిల్లుతోంది. సుమారు 2000 పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న 2 కోట్ల కోళ్ల ద్వారా రోజూ జరిగే ఉత్పత్తిపై రైతులకు నిత్యం రూ.కోట్లలో నష్టం వస్తోంది.