News February 6, 2025
ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News January 15, 2026
ఆదిలాబాద్: పురపోరు.. MPTC ప్రచారం జోరు..!

పల్లెల్లో రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం జోరందుకుంటోంది. అదే ఊపుతో పల్లెలోనూ ఎంపీటీసీ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మామడ మండలంలోని మొండిగుట్ట, తదితర గ్రామాల్లో యువకులు పార్టీలకతీతంగా ఒక అభ్యర్థిని ప్రకటించి తనకు సహకరించండి అని పల్లెల్లో గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులు ఇదేం కర్మరా బాబు అని అంటున్నారట.
News January 15, 2026
BISAG-Nలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్(BISAG-N)లో 6 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్( కంప్యూటర్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్ ఇంజినీరింగ్), ఎంఈ, ఎంటెక్(అర్బన్ ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్) అర్హత కలిగిన వారు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://bisag-n.gov.in/
News January 15, 2026
కలుపు మందుల పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఏ పంటకు సిఫార్సు చేసిన కలుపు మందులను ఆ పంటలో మాత్రమే సరైన మోతాదులో ఫ్లాట్ ప్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ను ఉపయోగించి పిచికారీ చేయాలి. కలుపు మందులను ఇతర రసాయనాలతో (కీటక/శిలింద్రనాశినులు/పోషకాలు) కలిపి ఉపయోగిస్తే కలుపు మందుల సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పంట మొలకెత్తాక ఉపయోగించే కలుపు మందులను.. కలుపు 2-4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారి చేసి సమర్థవంతంగా అరికట్టవచ్చు.


