News February 6, 2025
ములుగు: రైతు భరోసా డబ్బులు జమ!

ములుగు జిల్లా వ్యాప్తంగా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఎకరం లోపు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ అయినట్లు రైతులు తెలిపారు. ఎకరం విస్తీర్ణానికి పైగా ఉన్న రైతులకు కూడా ఒకటి, రెండు రోజుల్లో భరోసా నిధులు జమవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.
Similar News
News April 16, 2026
కృష్ణా: ప్రారంభమైన జనగణన.. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్ లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News April 16, 2026
నిర్మల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నిర్మల్ జిల్లా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో గురువారం 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత తానూర్లో నమోదయింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 సారంగాపూర్లోని జాం గ్రామంలో నమోదు కాగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ నెలలోనే నిప్పుల కొలిమిలా ఉంటే మే నెలలో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
News April 16, 2026
సీఎం పర్యటన వేళ పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

సీఎం చంద్రబాబు రేపు మంగళగిరి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణంలోని సీకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరగనున్న కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గురువారం కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ఎస్పీ భద్రత, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక వద్ద ప్రొటోకాల్ అమలు, పార్కింగ్ సౌకర్యాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా పరమైన అంశాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.


