News February 6, 2025
విజయవాడ: గోల్కొండ, ప్యాసింజర్ రైలు రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738817815633_50012803-normal-WIFI.webp)
ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గోల్కొండ, డోర్నకల్ ప్యాసింజర్ రైలు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో 17202, సికింద్రాబాద్ నుంచి గుంటూరు, 17201 గుంటూరు నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్, 67767 డోర్నకల్ నుంచి విజయవాడ వెళ్లే ప్యాసింజర్, 67768 విజయవాడ నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రద్దు కానున్నాయి.
Similar News
News February 6, 2025
పెద్దఅంబర్పేట్లో స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738838505489_52296546-normal-WIFI.webp)
పెద్దఅంబర్పేట్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల ప్రకారం.. హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో రిత్విక LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పసిపాప బస్సు కింద పడి నలిగిపోయిందని వారు వాపోయారు.
News February 6, 2025
సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా కుర్ర రాకేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738835224602_51806305-normal-WIFI.webp)
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా కుర్ర రాకేశ్, కార్యదర్శిగా మల్లారపు ప్రశాంత్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రాకేశ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు.
News February 6, 2025
కాంగ్రెస్ నుంచి సబ్కా వికాస్ను ఆశించడం కష్టమే: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738838559701_1199-normal-WIFI.webp)
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.