News February 6, 2025
పరకాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పరకాల మండలం పైడిపల్లికి చెందిన మొగిలి(60) ఈ నెల 1న తన భార్యతో కలిసి మిర్చి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో బయటకు వెళ్తున్న అని తిరిగి రాలేదు. మొగిలి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతడి భార్య తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 23, 2026
పది పబ్లిక్ పరీక్షలకు WGL జిల్లాలో 99.86% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.86 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 12,047 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,030 మంది హాజరు కాగా.. 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 6 పరీక్షా కేంద్రాలను, ACGE 4, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 25 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో గిరిరాజ్ తెలిపారు. 3వ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు వెల్లడించారు..
News March 23, 2026
వరంగల్: పది పరీక్షల మూడవ రోజు 99.91% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.
News March 23, 2026
వరంగల్: పది పరీక్షల మూడవ రోజు 99.91% హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 9,383 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 9,375 మంది హాజరు కాగా.. 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. DEO 4 పరీక్షా కేంద్రాలను, ACGE 5, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 17 కేంద్రాలను సందర్శించినట్లు డీఈవో రంగయ్య తెలిపారు. మూడవ రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అయన వెల్లడించారు.


