News February 6, 2025
గజ్వేల్లో KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా రాజీనామా చేయాలా..? వద్దా..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
Similar News
News March 20, 2026
పెరిగిన ‘పవర్’ పెట్రోల్ ధర

దేశవ్యాప్తంగా ‘పవర్’ పెట్రోల్ ధర పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOCL లీటర్పై రూ.2.09-రూ.2.35 వరకు వడ్డించాయి. ఈరోజు నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. నార్మల్ పెట్రోల్ రేట్లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల క్రూడాయిల్ సరఫరా తగ్గడంతో రేట్లు సవరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
News March 20, 2026
గోదావరి నదిలో గల్లంతైన వారి వివరాలు ఇవే..!

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలోకి దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.
News March 20, 2026
‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్ కోసం నమోదు చేసుకున్నారన్నారు.


