News February 6, 2025
సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఇతర అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News March 6, 2026
నేపాల్.. మ్యాజిక్ ఫిగర్ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. నేపాల్లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.
News March 6, 2026
T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.
News March 6, 2026
రక్త పరీక్షతో అల్జీమర్స్ను ముందే గుర్తించొచ్చు: వైద్యులు

ప్రస్తుతం చాలా మంది బాధపడే అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధిని రక్త పరీక్ష ద్వారా ముందే గుర్తించవచ్చని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ‘అల్జీమర్స్ లక్షణాలు కనిపించడానికి 20 ఏళ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతాయి. వీటిని గుర్తించేందుకు రక్తంలోని ‘p-tau217’ ప్రొటీన్ ద్వారా వ్యాధి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ముందే అంచనా వేయవచ్చు. ఇది వ్యాధి ముదరకముందే చికిత్స అందించడానికి తోడ్పడుతుంది’ అని సూచిస్తున్నారు.


