News February 6, 2025
వెల్దండ: ఆరాధ్య మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన

వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన ఆరాధ్య ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలు చెందుతున్నారు. బాలనగర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరాధ్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఆరాధ్య మృతిపై న్యాయ విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Similar News
News October 31, 2025
అండాశయ క్యాన్సర్కు కారణాలివే..

ఒవేరియన్ క్యాన్సర్కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్గా పరిగణిస్తారు నిపుణులు. విడుదలయ్యే అండాల సంఖ్య తగ్గితే అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా, పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా, హార్మోన్ చికిత్స తీసుకున్నా దీని ముప్పు పెరుగుతుంది.
News October 31, 2025
అండాశయ క్యాన్సర్ లక్షణాలు

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News October 31, 2025
MHBD: 22 ప్రాథమిక పాఠశాల్లో నూతనంగా ప్రీ ప్రైమరీ తరగతులు

MHBD జిల్లాలోని నూతనంగా 22 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రైమరీ విభాగానికి రెండు పోస్టులను DEO దక్షిణామూర్తి మంజూరు చేశారు. ప్రతి పాఠశాలకు ఒక పూర్వ ప్రాథమిక బోధకులు, ప్రతి పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలన్నారు. ఆయా పోస్టులకు కనీస విద్యార్హత 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని, దరఖాస్తులను నవంబర్ 7 వరకు MEOలకు అందించాలన్నారు.


