News February 6, 2025

వరంగల్: మార్కెట్‌లో ధరల వివరాలు..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వివిధ రకాల మిర్చి ఉత్పత్తులు రాగా.. ధరలు ఇలా ఉన్నాయి. 5531 మిర్చి రూ.10,500 పలకగా.. అకిరా బ్యాగడి మిర్చి రూ.11వేలు, ఎల్లో మిర్చి రూ.18 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే 2043 రకం మిర్చి రూ.14 వేలు, 334 మిర్చి రూ.13వేలు ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

Similar News

News March 21, 2026

HYD: బడ్జెట్‌లో పోలీస్ కమిషనరేట్లకు నిధులు

image

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లకు కలిపి బడ్జెట్ లో రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా HYD పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా…ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు రూ.40 కోట్లను కేటాయించారు. సైబరాబాద్ కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు.

News March 21, 2026

మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

image

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్‌ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.

News March 21, 2026

నర్మెట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఖరారు

image

ఈనెల 22 నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం, వివేక్‌లు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పర్యటనలో ఫ్యాక్టరీని ప్రారంబిచి ఫైలాన్ ఆవిష్కరిస్తారు.