News February 6, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఈఓ మహేశ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738820408839_51867159-normal-WIFI.webp)
కాళేశ్వరం ఆలయంలో రేపటి నుంచి జరుగనున్న మహాకుంభాభిషేకానికి రానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈఓ మహేష్ అన్నారు. పీఠాధిపతులు, అర్చకులు, స్వాములు గోపురం పైకి ఎక్కేందుకు వరంజాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ లైట్లు, తాగునీటి వసతి, భక్తులకు సరిపడా లడ్డు, పులిహోర ప్రసాదం ఇతర సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కుంభాభిషేకం ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు తరలిరావాలని కోరారు.
Similar News
News February 6, 2025
సిద్దిపేట: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850515598_1243-normal-WIFI.webp)
ఉత్తరప్రదేశ్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.
News February 6, 2025
రామయ్య హుండీ ఆదాయం రూ.1,13,23,178
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850490909_1280-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని 37 రోజుల తర్వాత గురువారం లెక్కించగా రూ.1,13,23,178 లు వచ్చినట్లు ఈవో రమాదేవి తెలిపారు. అంతేకాకుండా 109 గ్రాముల బంగారం, 895 గ్రాముల వెండి, 298 యూఎస్ డాలర్లు, 155 సింగపూర్ డాలర్లు, 430 యూఏఈ దీరమ్స్, 20 కెనడా డాలర్లు, 85 ఆస్ట్రేలియా డాలర్లు, 45 యూరప్ యూరోస్ కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు.
News February 6, 2025
మెదక్: కుంభమేళకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850098276_52001903-normal-WIFI.webp)
ఉత్తరప్రదేశ్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మనోహరాబాద్ మండలం డిలాయ్ (కూచారం) కు చెందిన ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. డిలాయ్ మెరుగు రవీందర్ యాదవ్ (45), గజ్వేల్ మండలం ఆరేపల్లికి చెందిన బామ్మర్ది భిక్షపతి కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. ప్రయాగ్ రాజ్ నుంచి అయోధ్య వెళుతుండగా కారుకు ప్రమాదం జరిగింది. రవీందర్ మృతిచెందగా, కొడుకు క్రువిత్, బామ్మర్ది తిరుపతి గాయపడ్డారు.