News February 6, 2025

2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

image

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.

Similar News

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News April 20, 2026

అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

image

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.