News February 6, 2025
సిరిసిల్ల: చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా గోనె ఎల్లప్ప

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడిగా సిరిసిల్ల పట్టణానికి చెందిన గోనె ఎల్లప్పను నియమిస్తున్నట్లు అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ గురువారం తెలిపారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలో గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎల్లప్ప మాట్లాడుతూ.. చేనేత రంగానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News March 8, 2026
మందమర్రి: ఉరేసుకొని విద్యార్థి సూసైడ్

మంచిర్యాల జిల్లా మందమర్రిలో విషాదం చోటుచేసుకుంది. అంగడిబజార్ సీఎస్పీ రోడ్డులో ఉంటున్న విద్యార్థి తనయి(16) ఉరేసుకున్నాడు. విద్యార్థి సింగరేణి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా ఉరేసుకొని మరణించడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 8, 2026
వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్లో ‘AK47’ ట్యాగ్లైన్కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
News March 8, 2026
MDK: పెరిగిన గ్యాస్ ధర.. రూ.36 కోట్ల భారం

కేంద్రం గ్యాస్ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 పెంచడంతో శనివారం నుంచి కొత్త ధరలకే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11.56 లక్షల గృహ గ్యాస్ కనెక్షన్లు ఉండగా వినియోగదారులపై ఏడాదికి సుమారుగా రూ.36 కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పప్పులు, నూనె, బియ్యం వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతుండగా తాజాగా పెరిగిన గ్యాస్ ధర మరింత భారం కానుంది.


