News February 6, 2025
ఏలూరు: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738828575363_51671582-normal-WIFI.webp)
ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసి పోలీసులు వారి వద్ద నుంచి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు ఎస్పీ శివ ప్రతాప్ కిషోర్ తెలిపారు. నేరానికి పాల్పడిన వారిలో ముగ్గురు నిందితులు కాగా ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు చెందిన నేరస్థులుగా గుర్తించారు. పలు కేసులలో నిందితులన్నారు.
Similar News
News February 6, 2025
చెరుకుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738850825059_50804161-normal-WIFI.webp)
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలైన ఘటన చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. రాజోలు గ్రామానికి చెందిన ముచ్చు నాగార్జున్రెడ్డి బైక్పై వెళ్తుండగా ఆటో ఢీకొంది. అనంతరం అతన్ని ఆటో కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నాగార్జునరెడ్డి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుణ్ణి చెరుకుపల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
News February 6, 2025
BREAKING: మహబూబ్నగర్ జిల్లాలో MURDER
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738849153093_1112-normal-WIFI.webp)
మహబూబ్నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.
News February 6, 2025
ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎప్పుడంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738849866688_893-normal-WIFI.webp)
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈనెల 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆరోజున బిహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో ₹2వేల చొప్పున మొత్తం ₹6వేలు అందిస్తోంది. e-KYC పూర్తి చేసిన వారికే ఈ డబ్బులు జమవుతాయి.