News February 6, 2025
PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి
రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.
Similar News
News February 6, 2025
తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!
AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్లో ఇంగ్లిష్తో పాటు తెలుగులో జీవోలను అప్లోడ్ చేస్తోంది. <
News February 6, 2025
స్కూల్లో ఫైర్.. 17 మంది చిన్నారులు సజీవదహనం
నైజీరియాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా స్టేట్ కైరా నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News February 6, 2025
మల్లన్నకు షోకాజ్ నోటీసులు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను అతిక్రమించారని అందులో పేర్కొంది. షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.