News February 6, 2025
సికింద్రాబాద్: మెట్టుగూడలో దారుణం

సికింద్రాబాద్ మెట్టుగూడలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిలకలగూడ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుక(55), ఆమె కుమారుడు యశ్వంత్ (30)పై ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తల్లి కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 8, 2026
రూ.5,812 కోట్లతో మూసీ నది ప్రాజెక్టు ఫేస్-1

రూ.5,812 కోట్లతో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు ఫేస్-1 పనులు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ విగ్రహానికి రూ.73.8 కోట్లు వెచ్చించనట్లు తెలిపారు. గాంధీ విగ్రహ వేదికకు రూ.22.6 కోట్లు, మ్యూజియం, భవనానికి రూ.220 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.79 కోట్లతో ఎలక్ట్రో-మెకానికల్ పనులు చేపట్టనున్నారు.
News March 8, 2026
HYD: యూట్యూబ్ చూసి డాలర్లలో సంపాదన!

HYD శివార్లలోని బాచుపల్లి, నిజాంపేట్ బస్తీల్లో ఇప్పుడు సీన్ మారింది. కుర్రాళ్లు సాయంత్రం అయితే చాలు కిరాణా కొట్టుల దగ్గర కూర్చుని ‘పైథాన్’ కోడింగ్ చిక్కుముడులు విప్పుతున్నారు. సాఫ్ట్వేర్ ఆఫీసుల ఏసీ గదుల కంటే గల్లీలోని వేపచెట్టు కింద కూర్చుని విదేశీ క్లయింట్లకు ప్రాజెక్టులు చేసివ్వడమే వీరి స్టైల్. ఏ డిగ్రీలు లేకపోయినా యూట్యూబ్ చూసి నేర్చుకున్న విద్యతో డాలర్లు సంపాదిస్తున్నారు.
News March 8, 2026
HYD: ఈ వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

హైదరాబాద్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీ సరికొత్త వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై చెత్త, నిండిన బిన్లు, మురుగునాళాల సమస్యలపై పౌరులు ఇకపై నేరుగా 8125966586 నంబర్కు ఫొటో, లొకేషన్ను వాట్సాప్ చేయవచ్చు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన ఈ విధానం ద్వారా ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తారు.


