News February 6, 2025
కాంగ్రెస్ నుంచి సబ్కా వికాస్ను ఆశించడం కష్టమే: మోదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738838559701_1199-normal-WIFI.webp)
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.
Similar News
News February 12, 2025
పడిపోయిన ఎలాన్ మస్క్ ఆస్తి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739293544648_1045-normal-WIFI.webp)
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తి 400 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా షేర్ల విలువ 27శాతం పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. సంస్థ కార్ల అమ్మకాలు భారీగా తగ్గడం దాని షేర్ల విలువపై ప్రభావం చూపించింది. గడచిన వారంలో 11శాతం మేర షేర్ల విలువ పడిపోవడం గమనార్హం. డోజ్ శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వ పెట్టుబడుల్ని ఆయన తగ్గించడం టెస్లా ఇన్వెస్టర్లకు నచ్చడం లేదని బిజినెస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News February 12, 2025
బూతులతో రెచ్చిపోయిన నటుడు పృథ్వీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292178101_695-normal-WIFI.webp)
హైబీపీతో బాధపడుతూ HYDలోని ఓ <<15429041>>ఆస్పత్రిలో చేరిన<<>> నటుడు పృథ్వీరాజ్ వైసీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. ‘11 అనే మాట వస్తే వైసీపీ వాళ్లు గజగజ వణికిపోతున్నారు. సినిమాను సినిమాగా చూడండి. నా తల్లిని నీచంగా మాట్లాడుతున్నారు కదరా’ అంటూ రాయడానికి వీలులేని తీవ్ర అసభ్య పదజాలంతో దుయ్యబట్టారు. కాగా ‘లైలా’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.
News February 11, 2025
PM ఫ్రాన్స్ పర్యటనలో చేసుకునే రక్షణ ఒప్పందాలివే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739290281407_1045-normal-WIFI.webp)
ఫ్రాన్స్నుంచి 26 రఫేల్-ఎం యుద్ధవిమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్మెరైన్లను నేవీ కోసం కొనుగోలు చేయాలని భారత్ సూచనప్రాయంగా నిర్ణయించింది. ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం పూర్తికానుంది. ఫైటర్ జెట్స్ ఒప్పందం విలువ రూ.63వేల కోట్లుగా ఉండొచ్చని అంచనా. INS విక్రాంత్, INS విక్రమాదిత్య నౌకలపై వీటిని మోహరించనున్నారు. ఇక 3 సబ్మెరైన్ల కొనుగోలు విలువ రూ.33,500 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.