News February 6, 2025
అన్నమయ్య: రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదు

ఇటీవల వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడం వల్ల పాఠశాల పని దినాలు 220 రోజులు కన్నా తక్కువ ఉన్నందున ఈనెల 8వ తేదీన రెండో శనివారం కూడా పాఠశాలలు పని దినంగా నిర్ణయించినట్లు డీఈవో బాలసుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలో రెండవ శనివారం పాఠశాలలకు సెలవు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని డీఈవో సూచించారు.
Similar News
News November 9, 2025
సిద్దిపేట: ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

నవంబర్ 15న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్లో ఉన్న 2230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీ పడవచ్చని, ఈనెల 15 వరకు ప్రతి రోజు లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. చిన్న చిన్న కేసుల్లో కోర్ట్ చుట్టూ తిరుగుతున్న ప్రజలకి ఇదొక మంచి అవకాశమని, రాజీ పడదగిన కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.
– SHARE IT
News November 9, 2025
ములుగులో బాలుడి మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమా?

కన్నాయిగూడెం మండలం గూరేవులకు చెందిన హరినాథ్(7) పాముకాటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బాలుడి మృతికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. పాముకాటుకు వైద్యుడి పర్యవేక్షణలో యాంటీ డోస్ ఇవ్వాల్సి ఉండగా, ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బంది సరైన రీతిలో స్పందించక పోవడంతో ఈ దారుణం జరిగిందని వారు వాపోతున్నారు.
News November 9, 2025
మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ హింస సరికాదు: జస్టిస్ సూర్యకాంత్

సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వేదికగా మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న హింసను కాబోయే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఖండించారు. వారి ప్రతిష్ఠకు హాని కలగకుండా నిర్ధిష్టమైన సెక్యూరిటీ ప్రొటోకాల్ అనుసరించాలని కోరారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ 31వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాంకేతికతను వాడుకొని వారి ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ, వారిని ట్రోలింగ్ సరైన చర్య కాదని పేర్కొన్నారు.


