News February 6, 2025
మంత్రి సంధ్యారాణికి 19వ ర్యాంక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738843824759_1100-normal-WIFI.webp)
సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
Similar News
News February 7, 2025
పెద్దపల్లి జిల్లాలోని నేటి టాప్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738859372574_14924127-normal-WIFI.webp)
@ ప్రియాంక గాంధీని కలిసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ@ గోదావరిఖనిలో బులియన్ వ్యాపారి పరారీ@ వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష@ సుల్తానాబాద్ లో డయాబెటిస్ పరీక్షలకు విశేష స్పందన@ పెద్దపల్లి దుకాణాలలో మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీ@ భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ: రామగుండం సిపి శ్రీనివాస్@ పెద్దపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం పై దాసరి ఉష విమర్శలు
News February 6, 2025
పడుకునే ముందు ఈ పనులు చేస్తే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738860664433_367-normal-WIFI.webp)
రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్ను వేరే గదిలో ఉంచడం బెటర్.
News February 6, 2025
ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738847857384_60337284-normal-WIFI.webp)
తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.