News February 6, 2025
మంత్రి సంధ్యారాణికి 19వ ర్యాంక్

సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో పార్వతీపురం మన్యం జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి 19వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
Similar News
News April 6, 2026
కడప: రవాణా శాఖకు రూ.195.21 కోట్ల ఆదాయం

కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖకు రూ.195.21 కోట్లు ఆదాయం లభించింది. జిల్లాలో రవాణా శాఖకు కడపలో డీటీసీ, ప్రొద్దుటూరులో ఆర్టీఓ, పులివెందుల, బద్వేల్, రాజంపేటలో ఎంవీఐ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి లైఫ్ టాక్స్ రూపంలో రూ.168.22 కోట్లు, ఫీజుల ద్వారా రూ.16 కోట్లు, పెనాల్టీల ద్వారా రూ.6.70 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.4 కోట్లు ఆదాయం లభించింది.
News April 6, 2026
చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలి: CM

TG: ఒలింపిక్స్ నిర్వహించేలా, చైనాను మించిన క్రీడా సదుపాయాలు HYDలో ఉండాలని రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులకు CM రేవంత్ సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. ‘క్రీడారంగంలో HYDను రోల్ మోడల్గా తీర్చిదిద్దాలి. జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం. ఆటగాళ్లు నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్తో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు.
News April 6, 2026
HYD: సర్వ రోగాలకు మందు ఇక్కడే!

ప్రజలకు వ్యాధులు వస్తే అత్యాధునిక ఆస్పత్రుల్లో వైద్యం అందించేకంటే అవి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జిమ్ ఫీజు భరించలేక వీటికి దూరమవుతున్నారు. రోజూ 45 MIN వ్యాయామంతో షుగర్, BP రావని నిపుణల మాట. GHMCలోని వార్డుల్లో, శివారు గ్రామాల్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి, పాడైనవి రిపేర్ చేయాలి. దీనికోసం కబ్జా అయిన పార్క్ స్థలాలను విడిపించి పార్క్గా, ఓపెన్ జిమ్గా మార్చితే సరి. మీరేమంటారు?


