News March 19, 2024

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 736.38 పాయింట్లు నష్టపోయి 72,012కి పడిపోయింది. నిఫ్టీ 238.20 పాయింట్లు కోల్పోయి 21,817 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో దాదాపు 1202 షేర్లు పెరగ్గా.. 2,458 షేర్లు పతనమయ్యాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ ఈ వారంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Similar News

News August 28, 2025

బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్న హీరోయిన్!

image

హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కనున్నారు. బిజినెస్‌మెన్ రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఆమె వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ జోడీ కలిసి దిగిన ఫొటోలను SMలో షేర్ చేశాయి. ఈ ఏడాదిలోనే అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు వెల్లడించాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. నివేదా తెలుగులో మెంటల్ మదిలో, అల వైకుంఠపురంలో, పాగల్ తదితర చిత్రాల్లో నటించారు.

News August 28, 2025

మెగా డీఎస్సీ.. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

AP: డీఎస్సీ అభ్యర్థులకు ఇవాళ ఉ.9 గంటల నుంచి <<17519055>>సర్టిఫికెట్<<>> వెరిఫికేషన్ ప్రారంభం కానున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. కాల్ లెటర్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు సర్టిఫికెట్లను సైట్‌లో అప్‌లోడ్ చేసి, తమకు కేటాయించిన తేదీ, సమయం, వేదికలో CVకి హాజరుకావాలని సూచించారు. వెరిఫికేషన్ పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని పేర్కొన్నారు.

News August 28, 2025

నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇవాళ కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు తెలంగాణ వర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుతున్నారు. ఇవాళ మీకు సెలవు ఉందా?