News February 6, 2025
VZM: న్యాయమూర్తులతో వీడియో కాన్ఫెరెన్స్

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి స్థానిక జిల్లా కోర్టు నుంచి గురువారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులను రాజీ చేయాలని సూచించారు. వివిధ కేసులను ఇరు వర్గాల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
Similar News
News January 8, 2026
త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.
News January 8, 2026
‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి’

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ, వైద్య-ఆరోగ్యం, విద్య, జల్ జీవన్ మిషన్, అమృత్, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
News January 8, 2026
బంగ్లాదేశ్లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

బంగ్లాదేశ్లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.


