News February 6, 2025

ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు

image

కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్‌ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.

Similar News

News November 4, 2025

కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

image

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.

News November 4, 2025

మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

image

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.

News November 4, 2025

మహిళల్లో ఫైనాన్షియల్‌ లిటరసీ పెంచాలని..

image

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్‌ గాడెస్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్‌ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.